ప్రలోభాలకు లొంగి పార్టీ మారే ప్రసక్తే లేదు.. YCP ఎంపీలు పార్టీ మారడంపై ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

by Anjali |   ( Updated:2024-08-30 05:50:44.0  )
ప్రలోభాలకు లొంగి పార్టీ మారే ప్రసక్తే లేదు.. YCP ఎంపీలు పార్టీ మారడంపై ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీలు పార్టీ మారడంపై ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు, వ్యక్తిగత అవసరాల కోసమే వారు పార్టీ మారుతున్నారని అన్నారు. పార్టీ మారొద్దని వారించినా వాళ్లు వినలేదని తెలిపారు. తమకు చాలా అవసరాలు ఉన్నాయని కృష్ణయ్య వెల్లడించారు. ఏదేమైనా, ఎలాంటి పరిస్థితిల్లోనైనా నేను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని గొంతెత్తి చెప్పారు. నా ఎజెండా ఎప్పటికీ బీసీల అభ్యున్నతే అని గర్వంగా చెప్పుకొచ్చారు. బీసీల కోసం కొట్లాడమనే జగన్ నన్ను రాజ్య సభకు పంపారని వెల్లడించారు. చివర వరకూ ఇక్కడే ఉంటానని అన్నారు. బీసీల కోసం పోరాడుతానని ధీమా వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగి పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదని అన్నారు. నా బీసీ సంఘమే ఒక పార్టీ అంత అని గర్వంగా చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో 14 మంది పార్టీ మారినా నేను మారలేదని కృష్ణయ్య వెల్లడించారు. మరింత ఉధృతంగా బీసీల కోసం పోరాడుతానని చెప్పారు.

Advertisement

Next Story