Breaking: ప్రచారానికి పవన్ సిద్ధం.. మొదలైంది జనసేనాని యుద్ధం

by Indraja |   ( Updated:2024-02-13 14:02:49.0  )
Breaking: ప్రచారానికి పవన్ సిద్ధం.. మొదలైంది జనసేనాని యుద్ధం
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖ పార్టీ నాయకులు ప్రచారాల్లో మునిగిపోయారు. తాజాగ ఇదే కోవలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరనున్నట్లు సమాచారం. అయితే ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రయాణించనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనువైన ప్రదేశం కోసం 175 నియోజకవర్గాల్లో గుర్తింపు చర్యలు చేపట్టారు.

ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనను జనసేనాని చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇక భీమవరంలో జరగనున్న సమావేశాలకు పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్ లో వెళ్లనున్నారు. ఇక భీమవరానికి విచ్చేస్తున్న జనసేనాని కోసం హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను పార్టీ నేతలు చేస్తున్నారు.

Read More..

Breaking News : శంఖారావంలో నారా లోకేష్ పంచ్ డైలాగ్.. సభ సైలెంట్

Advertisement

Next Story