టీటీడీ ప్రసాదంపై ప్రమాణానికి నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా.. సీఎంకు వైవీ సుబ్బారెడ్డి సవాల్

by Kavitha |
టీటీడీ ప్రసాదంపై ప్రమాణానికి నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా.. సీఎంకు వైవీ సుబ్బారెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

“తిరుమల ప్రసాదం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?” అంటూ ఎక్స్‌ వేదికగా వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ విసిరారు.

కాగా నిన్న చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed