‘EVM’ వార్.. మాజీ సీఎం జగన్ ట్వీట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్

by Satheesh |
‘EVM’ వార్.. మాజీ సీఎం జగన్ ట్వీట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈవీఎలంను హ్యాక్ చేయొచ్చంటూ టెస్లా కార్ల అధినేత, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలన్ మస్క్ చేసిన కామెంట్స్ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సైతం మస్క్ కామెంట్లను సమర్థించేలా ట్వీట్ చేశారు. ‘‘అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌నే వాడుతున్నాయి.. మన దగ్గర కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లే వాడాలి.. న్యాయం జరగడమే కాదు.. జరిగినట్లు కనిపించాలి’ అని జగన్ చేసిన ట్వీట్ ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. వైసీపీ ఘోర ఓటమి పాలుకావడంతోనే జగన్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

తాజాగా జగన్ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 2019లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేస్తున్నట్లు, 2024లో పరాజయం పాలు కావడంతో మాత్రం ఈవీఎంలపై నిందలు మోపుతున్నావని ఫైర్ అయ్యారు. వైసీపీ ఓటమకి ఈవీఎంలు కారణం కాదని.. నీ వైఫల్యాలతోనే ప్రజలు తిరస్కరించారని కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్‌లో సంస్థలను, వ్యవస్థలను నాశనం చేశావని ధ్వజమెత్తారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ ప్రజల హక్కులను కాలరాశాడని మండిపడ్డారు.

Next Story

Most Viewed