ఆదమరిస్తే మళ్లీ జన్మభూమి కార్యాలయాలు..!

by srinivas |
ఆదమరిస్తే మళ్లీ జన్మభూమి కార్యాలయాలు..!
X

దిశ, పీలేరు: మాయల మరాఠీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే ప్రజలకు మేలు చేసే సచివాలయాల స్థానంలో జన్మ భూమి కార్యాలయాలు వస్తాయని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఆదివారం పీలేరులో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత సింగిల్ విండో అధ్యక్షుడిగా నారే వెంకటరమణారెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అనంతరం ఏఫీ ఐఐసీ లే అవుట్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మిథున్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాటలు చెప్పటం తర్వాత తప్పటం చంద్రబాబు అలవాటు అని ఎద్దేవా చేశారు.


సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని మిథున్ రెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన నేత జగన్ మాత్రమేనని చెప్పారు. పీలేరులో ఇప్పటి వరకు 15 వేలు ఇంటి స్థలాలు మంజూరు చేసి మరో పీలేరును సృష్టించమని చెప్పారు.

సంక్షేమానికి మంగళం: ఎమ్మెల్యే చింతల

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వేస్తే సంక్షేమానికి మంగళం పాడతారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి జరిగితేనే ఓటు వేయాలని కోరారు. అనంతరం లే అవుట్‌కు త్వరిత గతిన మంజూరు చేసిన జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహమద్‌ను ఎంపీ. ఎమ్మెల్యే‌లు ఘనంగా సన్మానించారు. పీలేరు తహశీల్దార్ ధనుంజయ, ఎంపీడీవో మురళి మోహన్ రెడ్డిలను సైతం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ డైరెక్టర్ హరీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాధరెడ్డి, ఎంపీపీ సతీష్‌రెడ్డి, జెడ్పీటీసీ రత్న శేఖర్ రెడ్డి, సర్పంచ్ జీనతషఫీ, వైసీపీ నేతలు షఫీ, హబీబ్, హుమాయూన్, ఉదయ్ తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed