Minister Lokesh: ముమ్మాటికీ సైకో జగన్ పన్నిన కుట్రే అది.. మంత్రి లోకేశ్ సెన్సేషనల్ ట్వీట్

by Shiva |
Minister Lokesh: ముమ్మాటికీ సైకో జగన్ పన్నిన కుట్రే అది.. మంత్రి లోకేశ్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణ ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే బ్యారేజీ గేట్లను ఢీకొట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బోటు యజమానులైన రామ్మోహన్, ఉషాద్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అధికారం అండ‌గా సైకో జ‌గ‌న్ త‌న ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారు. 5 గ్రామాలను నామరూపాలు లేకుండా చేశారు.

అదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి, లక్షలాది మంది ప్రజలు జలసమాధి అయ్యేలా సైకో జ‌గ‌న్ ప‌న్నిన కుట్ర బ‌ట్టబ‌య‌లైంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాల‌నే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే, ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. తమ కుట్రలు బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తుంది సైకో జగన్ ముఠా’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed