తిరుమలతో సమానంగా శ్రీశైలం.. అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం

by srinivas |   ( Updated:2024-10-11 17:15:26.0  )
తిరుమలతో సమానంగా శ్రీశైలం.. అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలతో సమానంగా శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు అడుగులు వేస్తోంది. ప్రసాదం స్కీమ్ పర్యాటక రంగం నుంచి ఇప్పటికే 100 కోట్లు మంజూరు చేసింది. శ్రీశైలం అభివృద్ధి చేయడానికి వేల ఎకరాల భూమి అవసరం పడుతుందని భావిస్తోంది. ఇరిగేషన్ నుంచి రావాల్సిన భూమిపై ఇప్పటికే చర్చలు జరిపింది. భూములు బదిలీ చేయాలని కేబినెట్‌లోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాజాగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలోనే కీలక అడుగులు పడే అవకాశం ఉందని ఆనం పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed