TDP నేతలకు హైకోర్టులో ఊరట

by Seetharam |   ( Updated:2022-09-23 11:32:29.0  )
TDP నేతలకు హైకోర్టులో ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టీపీడీ, వైసీపీ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో ఏడుగురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ, కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా వీరందనీ పరామర్శించేందుకు చంద్రబాబు చిత్తూరు జైలులో కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఏడుగురు నేతలపై చిత్తూరు కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కుప్పం టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఏడుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేలు బాండ్, ఇద్దరు పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed