AP Politics:టీడీపీకి ఊహించని షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

by Jakkula Mamatha |
AP Politics:టీడీపీకి ఊహించని షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే. కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో వైసీపీ నేతలు పలువురు పార్టీ పట్ల అసహనంతో వైసీపీని వీడి అధికార టీడీపీలో చేరారు. అయితే వైసీపీ నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణం రాజు ఆ పార్టీని వీడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీకి రాజీనామా చేసి నేడు(గురువారం) మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గం పరిశీలకుడుగా ఉన్నారు. ఇవాళ మాజీ సీఎం జగన్ సమక్షంలో మురళీకృష్ణం రాజు వైసీపీలో చేరారు.

Advertisement

Next Story