- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఎన్నికల తర్వాత.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల మొదటి ఉమ్మడి పర్యటన
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ విజయం సాధించిన జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలో వచ్చిన వెంటనే కేబినెట్ కూర్పు చేసిన సీఎం.. డిప్యూటీ సీఎం.. వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూనే అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దుతున్నారు. అలాగే రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రంతో చర్చిస్తూ.. మెరుపు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలక నీర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు.. ఎక్కడ కూడా ఒకే స్టేజి ని పంచుకోవడం లేదు. అయితే ఈ నెల 30న నరసరావుపేటలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అక్కడ జరిగే వన మహోత్సవం లో ఇద్దరు నేతలు కలిసి పాల్గోననున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాన్, చంద్రబాబు నాయుడు కలిసి పాల్గొనబోతున్న మొట్టమొదటి ఉమ్మడి పర్యటనగా ఇది నిలవనుంది.