- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jagan, Pawan: జగన్, పవన్ ఈరోజు ఓటు వేయరట.. ఎందుకంటే..

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీలో రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు (Graduate mlc election) ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి (YS jagan), జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan kalyan)ఓటు వేస్తారా లేదా.. అనే ప్రశ్నలు ప్రజల్లో కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు (chandrababu), ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ (lokesh)ఉండవల్లిలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే జగన్, పవన్ మాత్రం తమ ఓటు వేయలేదు..ఎందుకంటే.. ఏపీలో రెండు చోట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒకటి గుంటూరు,కృష్ణా జిల్లా నియోజకవర్గం కాగా మరొకటి ఉభయగోదావరి ఉమ్మడి జిల్లా నియోజకవర్గం. వైఎస్జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలులేవు. దీంతో ఆయన ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. ఇకపోతే పవన్కల్యాణ్గ్రాడ్యుయేట్కాదు. కాబట్టి ఆయనకు గ్రాడ్యుయేట్ఓటు లేదు. వీరిద్దరూ తాము సూచించిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నారు.. గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారికి ఓటేయండి అంటూ పవన్కల్యాణ్ఓ వీడియోను విడుదల చేశారు. అదే విధంగా పీడీఎఫ్అభ్యర్థికి వైసీపీ అధినేత జగన్ తమ మద్దతు తెలిపారు. కానీ తమకు ఓటు లేకపోవడంతో ఈ అభ్యర్థులకు వారు మాత్రం వేయడం లేదు.