రాష్ట్రంలోని ఈ జిల్లాలో భారీగా పోలీసుల ట్రాన్స్‌ఫర్స్

by Mahesh |
రాష్ట్రంలోని ఈ జిల్లాలో భారీగా పోలీసుల ట్రాన్స్‌ఫర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాల్లో భారీగా పోలీసులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో రాయచోటి, రాజంపేట, మదనపల్లె సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ స్థాయిలో ఉన్న పోలీసులకు స్థానచలనం జరిగింది. గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులకు ఈ తాజా ట్రాన్స్ ఫర్ ఉత్తర్వుల్లో చోటు దక్కింది. 228 మంది కానిస్టేబుళ్లు, 123 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 41 మంది ఏఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు మొత్తం.. 382 మంది పోలీసు అధికారులకు స్థానచలనం జరగ్గా.. వెంటనే వారిని వారి వారికి కేటాయించిన ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు.

Advertisement
Next Story

Most Viewed