సిట్ విచారణ షురూ... అల్లర్ల ప్రాంతానికి అధికారులు

by srinivas |
సిట్ విచారణ షురూ... అల్లర్ల ప్రాంతానికి అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాలతో ఈ ఘటనలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతిలో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు సిట్ అధికారులు వెళ్లారు. వీరితో ఏపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లర్ల ఘటనలో విచారణ జరపాల్సిన అంశాలపై చర్చించారు. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నరసరావుపేటలో విచారణ జరిపాలని సిట్ అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో నమోదు కేసులను సైతం పున: పరిశీలించాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో ఈసీకి సిట్ నివేదికను అందజేయనున్నారు.

Read More..

సీఎం జగన్ లండన్ పర్యటనలో టెన్షన్.. అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్



Next Story