- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
అమానుషం: ముగ్గురు మహిళలపై వార్డు నెంబర్ దౌర్జన్యం
దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లా నూజివీడు మండలం మోర్సపూడి గ్రామంలో అమానుష ఘటన జరిగింది. ఓ వార్డు మెంబర్ రెచ్చిపోయాడు. మానవత్వం మరిచిపోయి ముగ్గురు మహిళపట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే వార్డు మెంబర్ ఆంజనేయులుకు స్థలం ఉంది. ఆ స్థలంలో సమీపంలో ఉండే వారు గొర్రెలు మేపారు. తన స్థలంలో గడ్డిని గొర్రెలు తిన్నాయనే కారణంతో గొర్రెల కాపరిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడి భార్య అడ్డుకుంది. అయినప్పటికీ వినకుండా దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ దంపతుల ఇద్దరు అమ్మాయిలు కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వార్డు మెంబర్ కోపోద్రిక్తుడై వారిపైనా దాడికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు మహిళలపైనా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ స్థలం మీది కాదని సచివాలయం స్థలంలో గొర్రెలు తిన్నాయి అని చెప్పినా వినిపించుకోకుండా అత్యంత దారుణంగా అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు మహిళలను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.