‘అదే జరిగితే టీడీపీ అధికారంలో ఉండేది రెండేళ్లే’.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |
‘అదే జరిగితే టీడీపీ అధికారంలో ఉండేది రెండేళ్లే’.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 లో జమిలి ఎన్నికలు జరిగినట్టయితే టీడీపీ(TDP) ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి అన్నారు. ఈ లోపు టీడీపీ నేతలు చెప్పినట్లుగా అధికారులు నడుచుకోవద్దని, వారి మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.

నూతన మద్యం దుకాణాల్లో 90 శాతం టీడీపీ నేతలకే దక్కాయని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే లాటరీ ప్రక్రియ కొనసాగిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే షాపుల ఎంపిక జరిగిందన్నారు. ఎల్లో బ్యాచ్ బాగు కోసమే సీఎం చంద్రబాబు మద్యం పాలసీని ప్రకటించారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా రానున్నాయని కాకాణి ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో లిక్కర్‌ను డోర్ డెలివరీ కూడా చేస్తారని చెప్పారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో చంద్రబాబు మూడంచెల విధానాన్ని అమలు చేస్తారని మాజీ మంత్రి కాకాణి పేర్కొన్నారు.

Next Story