- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP News:బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. పుంగనూరులో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన పై తాజాగా ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. ఈ నేపథ్యంలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు హోం మంత్రి అనిత ప్రకటించారు. ఆ చిన్నారి ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోం మంత్రి అనిత తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో వందల మందిపై అత్యాచారాలు జరిగాయని అన్నారు. కానీ మాజీ సీఎం జగన్ ఏ ఒక్కరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదని ఫైరయ్యారు. చిన్నారి హత్య కేసును వైసీపీ రాజకీయం చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదని చిన్న గాయం లేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని హోం మంత్రి అనిత తెలిపారు.