అక్ర‌మంగా గోవుల‌ను త‌ర‌లిస్తున్న ఇద్ద‌రిపై కేసు న‌మోదు..

by Kalyani |
అక్ర‌మంగా గోవుల‌ను త‌ర‌లిస్తున్న ఇద్ద‌రిపై కేసు న‌మోదు..
X

దిశ‌, ఏటూరునాగారంః- అక్ర‌మంగా గోవుల‌ను గోవ‌దశాల‌కు బోలేరో వాహ‌నంలో త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు ప‌ట్టుకుని కేసు న‌మోదు చేశారు. పోలిసుల క‌థ‌నం మేర‌కు..ఆదివారం రోజు తెల్ల‌వారు జామున ములుగు జిల్లా వాజేడు మండ‌లం జ‌గ‌న్నాద పూరం క్రాస్ వ‌ద్ద పోలీసులు వాహ‌నల త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ఛత్తీస్ ఘ‌డ్ నుండి హైదారాబాదు లోని గోవ‌ద శాల‌కు ఏలాంటి అనుమ‌తి ప‌త్రాలు లేకుండా బోలేరో వాహ‌నంలో గోవుల‌ను త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు షేక్ అలీ, షేక్ మొయినోద్దిన్ వాజేడు పోలిసులు ప‌ట్టుకున్నారు. ప‌ట్టుబడిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఏస్సై రుద్రార‌పు హ‌రిష్ తెలిపారు. ఈ త‌నిఖీలో ప‌ట్టుబ‌డిన గోవుల సంర‌క్ష‌నార్దం వాటిని గోశాల‌కు త‌ర‌లించిన‌ట్లు ఏస్సై హ‌రిష్ తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఏస్సై హ‌రిష్ మాట్లడుతూ..చ‌ట్ట వ్య‌తీరేక మైన కార్య‌క‌ల‌పాల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు.

Advertisement

Next Story

Most Viewed