- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AP News:హైకోర్టులో పిన్నెల్లికి బెయిల్..నేడు జైలు నుంచి విడుదల
దిశ,వెబ్డెస్క్: ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. నిన్న (ఆగస్టు 23) ఏపీ హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు (శనివారం) విడుదల కానున్నారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. పిన్నెల్లికి పలు కండీషన్లపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఆయన బెయిల్పై జైలు నుంచి విడుదల కానున్నారు. నిన్న సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు. ఈ క్రమంలో నెల్లూరు జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు చేరుకున్నారు.