High Court: వైసీపీ నేతలకు చుక్కెదురు.. ఆ పిటీషన్ల తిరస్కరణ

by Mahesh |   ( Updated:2024-09-04 14:53:01.0  )
High Court: వైసీపీ నేతలకు చుక్కెదురు.. ఆ పిటీషన్ల తిరస్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ(YCP) నేతలకు షాక్ తగిలింది. గతంలో టీడీపీ(TDP) ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు(AP High Court) పలువురి పిటిషన్లను తిరస్కరించింది. అలాగే చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం వేసిన జోగి రమేష్(Jogi ramesh) పిటిషన్ ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా 2021లో అప్పటి అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP Central Office)పై వందల సంఖ్యలో దాడి చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దాడులకు పురిగొల్పిన వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed