గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్

by M.Rajitha |
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరోజు పసికందు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన షేక్ నసీమాకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆదివారం అర్థరాత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రాత్రి 1 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి బాబు బాగున్నాడు అని ఎత్తుకున్నట్టు నటించి.. వార్డ్ నుండి బాబును తీసుకొని బయటికి వెళ్ళింది. అప్రమత్తమైన తల్లి కేకలు వేస్తూ.. మహిళ బాబును తీసుకువెళ్ళిందని డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బందికి కుటుంబ సభ్యులకు తెలుపగా.. తక్షణమే మహిళను పట్టుకునేందుకు బయటికి పరుగులు తీశారు. అయితే అప్పటికే ఆ మహిళ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసుకొని పసికందు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement

Next Story