- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
విజయవాడ అడిషనల్ డీజీపీ ఆఫీస్లో ఘరానా మోసం: ఉద్యోగాల పేరుతో ఉద్యోగి వసూళ్లు
by Seetharam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ అడిషనల్ డీజపీ ఆఫీస్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అకౌంటెంట్ రవికుమార్ వసూళ్లకు పాల్పడ్డాడు. దాదాపుగా రూ.29 లక్షల వరకు వసూలు చేశాడు. అనంతరం డబ్బులు తీసుకున్న వ్యక్తులకు ఫేక్ కాల్ లెటర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఆ కాల్ లెటర్లు ఫేక్ అని తెలియడంతో రవికుమార్ మోసాలు బయటపడ్డాయి. ఫేక్ కాల్ లెటర్లను చూసి తాము మోసపోయామని గ్రహించారు. దీంతో ముగ్గురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Advertisement
Next Story