నేడు రెండు జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పర్యటన.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
నేడు రెండు జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పర్యటన.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు(బుధవారం) రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రౌడీషీటర్ దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చేరుకుంటారు. ఈ క్రమంలో ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు బయలుదేరనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్(YS Jagan) రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు.

Advertisement

Next Story