పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు.. AP మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Anjali |   ( Updated:2024-08-31 08:47:00.0  )
పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు.. AP మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఉదయం మాజీ మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. కాలేజీ బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ అనడం దురదృష్టకరమని తెలిపింది. ఇక పార్టీ గురించి మాట్లాడుతూ.. నేను ఏ పార్టీ మారడం లేదని స్పష్టత ఇచ్చింది. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలని గుర్తు చేసింది. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కొక్కరుగా పార్టీ మారుతూ వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed