కనకదుర్గమ్మను దర్శించుకున్న సినీనటి హన్సిక

by Seetharam |
కనకదుర్గమ్మను దర్శించుకున్న సినీనటి హన్సిక
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడలో సినీనటి హన్సిక సందండి చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సినీనటి హన్సిక బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన హన్సికకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దగ్గర ఉండి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా హన్సిక అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. హన్సికకు అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఆ తర్వాత హీరోయిన్ హన్సిక మీడియాతో మాట్లాడారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.‘మై నేమ్ ఇస్ శృతి’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడకు వచ్చినట్లు హన్సిక తెలిపారు. ఈ సినిమా నవంబర్ 17న వరల్డ్ వైడ్‌గా విడుదలవ్వబోతుందని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని అమ్మవారిని కోరినట్లు హీరోయిన్ హన్సిక తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed