Road Accident: తిరుపతిలోని పాకాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Mahesh |
Road Accident: తిరుపతిలోని పాకాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలోని పాకాలలో శుక్రవారం తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చి, లారీ బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నారాయణ, జయచంద్ర, నాగమల్లయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృత దేహాలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



Next Story