Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Mahesh |
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం(road accident)లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోరమైన ప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో( Annamayya district) చోటు చేసుకుంది. జిల్లాలోని రాజానగర్ దగ్గర బస్సు-కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి.. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed