‘ఒక్క ఛాన్స్ అని నాశనం చేశాడు’.. జగన్‌పై బుచ్చయ్య చౌదరి సీరియస్

by Satheesh |
‘ఒక్క ఛాన్స్ అని నాశనం చేశాడు’.. జగన్‌పై బుచ్చయ్య చౌదరి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. రాజమండ్రిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో అధికారులు తప్పుడు దారిలో నడిచారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ తీరుతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని బాగుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే చంద్రబాబు పనులు మొదలు పెట్టారన్నారు. సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే భారీగా ఉద్యోగాలు కల్పించే ఫైల్‌పై సంతకం చేశారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో రాజమండ్రి రూరల్ టికెట్ దక్కించుకుని విజయం సాధించిన బుచ్చయ్య చౌదరికి.. చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కలేదు. మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు మంత్రి మండలిలో చోటు దక్కకపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed