‘మొత్తం 300లకు పైగా వీడియోలు తీశారు’ బాయ్స్‌కు అమ్ముతున్నారని ఆరోపిస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్

by Anjali |
‘మొత్తం 300లకు పైగా వీడియోలు తీశారు’ బాయ్స్‌కు అమ్ముతున్నారని ఆరోపిస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నారు. హిడెన్ సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనా వారం కిందటే వెలుగులోకి వచ్చినా నిర్వహకులు పట్టించుకోవడం లేదని కళాశాల యాజమాన్యంపై మండిపడుతున్నారు. యాజమాన్యానికి అంతా తెలుసునని, తెలిసే అంతా మభ్యపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రిన్సిపాల్ కు, హాస్టల్ మేనేజ్‌మెంట్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. కానీ ఫ్రూప్స్ కావాలని అడిగారని తెలిపారు. ఫైనల్ ఇయర్ చదువుతోన్న ఓ అమ్మాయి ప్రమేయంతోనే కెమెరాలు పెట్టారని అంటున్నారు. మొత్తం 300లకు పైగా వీడియోలు తీశారని, ఆ వీడియోలను బాయ్స్‌కు అమ్ముతున్నారని ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.తాజాగా సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ గుడ్లవల్లేరుకు చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed