జనసేనకు గుడ్ న్యూస్... ఆ గుర్తు కేటాయింపు

by Disha Web Desk 16 |
జనసేనకు గుడ్ న్యూస్... ఆ గుర్తు కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసును జనసేనకు కేటాయించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీఈవో మీనా ముఖేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో జనసేన సింబల్‌గా గాజు గ్లాసు కేటాయించాలని సూచించారు. గతంలో గాజు గుర్తు ఫ్రీ సింబల్‌గా ఉండటంతో తమకు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని జనసేన కోరింది. అయితే గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో జనసేనికుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న నిర్ణయం జనసైనికులకు ఊరట కల్పించింది.


కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇప్పటి కూటమి అభ్యర్థుల నామినేషన్ల ఆమోదం పొందాయి. దీంతో ఎన్నికలకు సిద్ధముతున్నారు. అయితే బీజేపీ, టీడీపీకి గుర్తులున్నాయి.కానీ జనసేనకు సింబల్ లేదు. దీంతో ఆ పార్టీలో టెన్షన్ నెలకొంది. తెలంగాణ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది. ఏపీ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. చివరకు గాజు గ్లాసు గుర్తుతోనే పోటీకి దిగుతోంది.



Next Story

Most Viewed