మితిమీరిన డిజే సౌండ్స్.. ఆగిన యువకుని గుండె

by M.Rajitha |
మితిమీరిన డిజే సౌండ్స్.. ఆగిన యువకుని గుండె
X

దిశ, వెబ్ డెస్క్ : అమాలపురంలో మితిమీరిన డిజే సౌండ్స్ తో ఓ యువకుని గుండె ఆగిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమాలపురం సమీపంలోని కొనకాపల్లి గ్రామంలో దసరా వేడుకల్లో ఏర్పాటు చేసిన డిజే ముందు డ్యాన్స్ చేస్తూ.. ఆ మితిమీరిన చప్పుడుకు 21 ఏళ్ల వినయ్ కుప్పకూలిపోయాడు. అప్పటివరకూ ఉత్సాహంగా చిందులు వేసిన యువకుడు పడిపోవడంతో కంగారు పడిన తోటి వారు వెంటనే అతనికి సీపీఆర్ చేశారు. దగ్గర్లోని ఆసుపత్రికి చేర్చగా.. అప్పటికే వినయ్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లో చదువుతున్న వినయ్ దసరా సెలవులకు తన స్వగ్రామం అయిన బండారులంకకు వచ్చాడు. దసరా ఉత్సవాల్లో కోనసీమ జిల్లాల్లో చెడితాలింఖానా విన్యాసాలకు, డిజేలు పెట్టి పాటలతో డ్యాన్సులు చేస్తుంటారు. అయితే అతిగా డిజే సౌండ్ పెట్టడం వలన ఆ ప్రభావం గుండెమీద పడి ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed