ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు జిల్లాకు వస్తే కొడతారా? : అయ్యన్నపాత్రుడు

by Seetharam |   ( Updated:2023-10-24 11:27:57.0  )
ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు జిల్లాకు వస్తే కొడతారా? : అయ్యన్నపాత్రుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాయలసీమలో వైసీపీ గూండాలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు జిల్లాకు వస్తే కొడతారా? అని నిలదీశారు. దాడికి పాల్పడినవారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే సరిపోతుందా.. అరెస్ట్ చేయరా? అని పోలీసులను ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాళ్లపై దాడి చేసినా మంత్రులు బొత్స సత్యనారాయణ , ధర్మాన ప్రసాదరావులు ఎందుకు నోరు మెదపడంలేదు? అని ప్రశ్నించారు. పుంగనూరులో ఉత్తరాంధ్ర వాసులపై దాడిని అంతా ఖండించాలి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.

Advertisement

Next Story

Most Viewed