అసలైన ప్రజా నాయకుడు YSR: Rahul Gandhi

by srinivas |
అసలైన ప్రజా నాయకుడు YSR: Rahul Gandhi
X

దిశ, వెబ్ డెస్క్: అసలైన ప్రజా నాయకుడు వైఎస్సార్ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రజలకోసమే వైఎస్ పని చేశారని తెలిపారు. వైఎస్సార్ మరణం అత్యంత విషాదమని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరేలా ఉండేదని తెలిపారు. ఏపీకి కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కాదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని వైఎస్ షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తోందన్న నమ్మకం తనకుందని చెప్పారు. వైఎస్‌లో ఉన్న తెగువ, క్రమశిక్షణ, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు వైఎస్ షర్మిలో కనిపిస్తున్నాయన్నారు. తాను వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే తాను జోడో యాత్ర చేశానని, ఆ రోజు ఎండ, వానను లెక్క చేయకుండా వైఎస్ పాదయాత్ర చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

Advertisement

Next Story