అవినాశ్ జీవితం నాశనం చేసేందుకు షర్మిల ప్రయత్నం.. జగన్ పరోక్ష కామెంట్స్

by Disha Web Desk 9 |
అవినాశ్ జీవితం నాశనం చేసేందుకు షర్మిల ప్రయత్నం.. జగన్ పరోక్ష కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు మనిషి అని ఆరోపించారు. టీడీపీ పార్టీని గెలిపించేందుకే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తం పార్టీకి ఓటేస్తే మన ఓట్లను చీల్చి ఎన్‌డీఏను గెలిపించడం కాదా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్‌తో కాపురం చేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయని మండిపడ్డారు. ఎంపీ అవినాశ్ జీవితాన్ని నాశనం చేసేందుకే చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్ట పన్నుతుందని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed