Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు

by Jakkula Mamatha |
Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు
X

దిశ, తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ.. ‘"క" సినిమా ఈ నెల 31 వ తేదీ దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ సినిమా నాకు నా కెరీర్ కు చాలా ముఖ్యమైనది. ప్రేక్షక దేవుళ్ళు సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో థియేటర్ల కొరత కారణంగా రిలీజ్ తేదీ మార్చడం జరిగింది. నేను మరో మూడు సినిమా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed