శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి?

by Disha Web Desk 18 |
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి?
X

దిశ,తిరుమల:బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు దంపతులు ఈ రోజు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆలయ మర్యాదల ప్రకారం వారికి తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు.గురువారం ఉదయం సతీ సమేతంగా శ్రీవారి ఆలయానికి వచ్చిన ఆయన వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడాలని మీడియా కోరగా దేవుని సన్నిధిలో అవి ఏవి మాట్లాడకూడదంటూ నేరుగా ముందుకెళ్లిపోయారు. అదేవిధంగా భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణ ఎల్లా సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.


Next Story

Most Viewed