డబ్బుకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
డబ్బుకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డబ్బుకు పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మడకశిర టికెట్‌ను ఉపాధి హామీ కూలీ అయిన ఈరలక్కప్పకు సీఎం జగన్ టికెట్ ఇచ్చారని, అలాంటి సాహసం చంద్రబాబకు కేసే దమ్ముదా అని ప్రశ్నించారు. డబ్బుకు పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నాడటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సమర్ధవంతంగా అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. రాష్ట్రంలో మరోసారి సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరడం పక్కా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Next Story