జైలులో ఉన్న చంద్రబాబుపై అవి పగతీర్చుకోబోతోన్నాయా?.. సంచలనం సృష్టిస్తోన్న ట్వీట్

by sudharani |
జైలులో ఉన్న చంద్రబాబుపై అవి పగతీర్చుకోబోతోన్నాయా?.. సంచలనం సృష్టిస్తోన్న ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పొలిటికల్‌ విషయాలపై ట్వీట్లు చేస్తూ సంచలనం సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా.. చంద్రబాబు నాయుడుపై రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారింది.

అయితే.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ మొదలు వర్మ తన సోషల్ మీడియా వేదికగా ఏదో రకంగా స్పందిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే గతంలో.. దోమల నియంత్రణకు ‘దోమలపై దండయాత్ర’ పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు ఓ కార్యక్రమం చేశాడు. దీనిని గుర్తుచేస్తూ... ఆర్‌జీవీ ‘‘ఆ దోమలే ఇప్పుడు CBN మీద పగ తీర్చుకుంటున్నాయా??? ఇది రక్త చరిత్ర కాదు.. ఇది దోమ చరిత్ర’’ అంటూ సెటరీకల్‌గా ట్వీట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed