- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పుడింగి సంగతి తేలుస్తా.. మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్డెస్క్: పుంగునూరుకు వెళ్తున్న.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం అంగుళ్లు పర్యటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ది రెడ్డి దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని.. దాక్కోవడం కాదు.. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకుడదా అని ప్రశ్నించారు. నేను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టానని.. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడనన్నారు.
ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడని.. ఇక్కడి రావణాసురుడికి ట్యాగ్ ఎమ్మెల్యే అని మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఫైర్ అయ్యారు. బాంబులకే భయపడలేదు.. ఈ రాళ్ల దాడులకు భయపడతానా అని అన్నారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ జోలికి వచ్చిన ఎవరినీ వదిలిపెట్టమని బాబు హెచ్చరించారు.
Read More..
Breaking: చంద్రబాబు పుంగనూరు టూర్లో హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత