BREAKING: హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేష్.. ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు

by Shiva Kumar |
BREAKING: హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేష్.. ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కోర్టుల బాట పడుతున్నారు. గతంలో టీడీపీ నేతలపై దాడులకు తెగబడిన వైసీపీ నేతలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నివసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. కేసులో ముందస్తు బెయిల్ కొరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఈ నెల 8న రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed