చేరికలపై బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
చేరికలపై బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో చేరికలపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరైనా పార్టీలో చేరాలంటే జిల్లాలో చర్య జరుగుతుందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే చేర్చుకుంటామని స్పష్టం చేశారు. చేర్చుకునే ముందే వారి పేర్లు చెబుతామని అన్నారు. తప్పకుండా నామినేటెడ్ పదవుల కోసం పోటీ ఉంటుందని.. మూడు పార్టీలు చర్చించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రపంచంలోనే బీజేపీ బలమైన రాజకీయ పార్టీ అన్నారు. ఎవరు పార్టీలోకి వస్తామన్నా.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి, జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటామన్నారు. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed