- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చి రాగానే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిచేస్తుంది. రాష్ట్రంలో గాడితప్పిన అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ.. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను రద్దు చేస్తుంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం సెబ్ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన 12 జీవోలు రద్దు చేసింది. అలాగే సెబ్కు గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. వారందరిని వెంటనే ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని సెబ్ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కాగా గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందిని సెబ్కు కేటాయించిన సంగతి తెలిసిందే.