CM Chandrababu:‘మీ సేవలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’.. హరికృష్ణకు ఘన నివాళులర్పించిన AP సీఎం

by Anjali |
CM Chandrababu:‘మీ సేవలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’.. హరికృష్ణకు ఘన నివాళులర్పించిన AP సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు టాలీవుడ్ ఉత్తమ నటుడు దివంగత నందమూరి హరికృష్ణ 68వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికన హరికృష్ణ కు ఘన నివాళులు అర్పించారు. సినీ నటుడుగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడుగా, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా ఆయన అందించిన సేవలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జీవితపు ఆఖరు క్షణం వరకూ అందరికీ ఆత్మీయుడుగా మెలిగిన హరికృష్ణ ప్రజా హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఇక హరికృష్ణ తెలుగులో శ్రీకృష్ణావతారం, సీతారామరాజు, హరిశ్చంద్రప్రసాద్, శ్రావణమాసం, లాహిరి లాహిరి వంటి చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ ఈ నటుడు అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో 2018 లో మరణించారు. దీంతో సినీ ఇండస్ట్రీలో అండ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Next Story