- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చంద్రబాబు పేషీలోకి ఏ.వీ, రాజమౌళి.. సీఎంవోలో కీలక బాధ్యతలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేషీలోకి ఐఏఎస్ ఏ.వి. రాజమౌళి వచ్చి చేరారు. యూపీ కేడర్కు చెందిన ఆయనను సీఎంవోలో కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో కేరళ కేడర్ ఆఫీసర్ కృష్ణతేజకు లైన్ క్లియర్ అయింది. పవన్ కల్యాణ్ ఓఎస్డీగా కృష్ణతేజను పంపేందుకు సోమవారం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంచి గుర్తింపు ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు అధికారులను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. పలానా అధికారి కావాలని, పట్టుపట్టి డిప్యూటేషన్పై పంపాలని కేంద్రప్రభుత్వానికి లేఖలు రాసి మరీ ఏపీకి తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో లాయింగ్, ఏపీకి ఎక్కువ నిధులు రాబట్టేందుకు అనుకూలమైన అధికారులను పిలుపించుకుని మరీ వారిని కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఏవీ రాజమౌళి కార్యదర్శిగా పని చేశారు. అయితే జగన్ ప్రభుత్వంలో ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో పాటు ఆయన డిప్యూటేషన్ ముగియడంతో యూపీ కేడర్కు వెళ్లిపోయారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వెళ్లడంతో రాజమౌళి రాష్ట్రానికి వచ్చారు.