త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం

by srinivas |
త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో సీఎం చంద్రబాబు హామీల్లో భాగంగా చేసిన 5 సంతకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు, అదే నెలలో బడ్జెట్ ప్రవేశ‌పెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ శాఖల శ్వేతపత్రాలను విడుదల చేయాలని మంత్రులు నిర్ణయించారు. శ్వేతపత్రాల విడుదలపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ మంత్రులు నిర్ణయించారు.

Advertisement

Next Story