- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఏపీలో మరో ప్రమాదం..24 మంది విద్యార్థులకు అస్వస్థత
X
దిశ,వెబ్డెస్క్:ఏపీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. సైన్స్ ల్యాబ్లో రసాయనాలు లీకవడంతో ఆ వాయువులను పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పై అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే విద్యార్ధులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story