లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎంఈఓ

by karthikeya |
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎంఈఓ
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురంలో ఓ ఎంఈఓ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బళ్లారి ప్రాంతంలో ఎంఈవోగా పనిచేస్తున్న నిందితుడు చంద్రశేఖర్ రూ.2లక్షలు లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో‌ (Anti-Curruption Bereau)కి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఓ ప్రైవేటు స్కూల్‌కు అనుమతుల మంజూరు కోసం ఆయన ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించడంతో పక్కాగా వల వేసిన అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

Next Story