- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
రూ. 7 వేలు పింఛన్ తీసుకున్న వృద్ధుడు.. సంతోషంలో ఏం చేశాడంటే..!
![రూ. 7 వేలు పింఛన్ తీసుకున్న వృద్ధుడు.. సంతోషంలో ఏం చేశాడంటే..! రూ. 7 వేలు పింఛన్ తీసుకున్న వృద్ధుడు.. సంతోషంలో ఏం చేశాడంటే..!](https://www.dishadaily.com/h-upload/2024/07/01/347976-pin.webp)
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తి అయింది. 97 శాతం పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి అయినట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సెక్రటేరియట్ సిబ్బంది ఈ రోజు ఉదయం నుంచి పింఛన్ డబ్బులను వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిర్విరామంగా పంపిణీ చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలకు రావాల్సిన రూ. 1000తో కలిపి జులై నెలకు సంబంధించిన రూ. 4 వేలను లబ్ధిదారులకు అందజేశారు. దీంతో రూ. 7 వేలు తీసుకున్న ఓ వృద్ధుడు రోడ్డుపైకి వచ్చి డ్యాన్స్ వేశారు. పింఛన్ నగదును చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జై బోలో జైబోలో చంద్రబాబుకి జై బోలో, జై చంద్రన్న, ఆహా, ఓహో అంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కల్యాణ్పై పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్పై ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.