అచ్యుతాపురం సెజ్ ప్రమాదం.. ఐదుకు చేరిన మృతులు

by M.Rajitha |
అచ్యుతాపురం సెజ్ ప్రమాదం.. ఐదుకు చేరిన మృతులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. గాయపడిన కార్మికులకు అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియ ఫార్మా కంపెనీలో ఓ రియాక్టర్ లో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలడంతో అక్కడికక్కడే ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి ఫార్మా కంపెనీ భవన్ పూర్తిగా దెబ్బతిన్నది. భారీ ఎత్తున మంటలు ఎగసి పడి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. అనకాపల్లి కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Next Story

Most Viewed