- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- భక్తి
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
Home > ఆంధ్రప్రదేశ్ > అత్తాకోడళ్ల పై లైంగికదాడి కేసులో నిందితులు అరెస్ట్.. జిల్లా ఎస్పీ కీలక విషయాలు వెల్లడి
అత్తాకోడళ్ల పై లైంగికదాడి కేసులో నిందితులు అరెస్ట్.. జిల్లా ఎస్పీ కీలక విషయాలు వెల్లడి
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్డెస్క్: ఏపీలో అత్తాకోడళ్ల పై లైంగికదాడి జరిగిన ఘటన కలకలం రేపుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి అత్తాకోడళ్ల పై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ సృష్టించింది. ఈ నేపథ్యంలో అత్తాకోడళ్ల లైంగికదాడి కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీ రత్న తాజాగా మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ రత్న తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు నిందితులు అరెస్ట్ కాగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ నిందితుల్లో ముగ్గురు మైనర్లు, మరో ఇద్దరు 20 ఏళ్ల వ్యక్తులు ఉండటం గమనార్హం. ఈ దుండగులు ప్రధానంగా తండ్రి, కొడుకు పై దాడి చేసిన అనంతరం అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేశారని తెలిపారు. త్వరలోనే పరారీలో ఉన్న ఇద్దరినీ కూడా పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
Next Story