KTR: గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు కేటీఆర్ కీలక సమావేశం

by Prasad Jukanti |   ( Updated:2024-10-15 13:07:58.0  )
KTR: గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు కేటీఆర్ కీలక సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) పై బీఆర్ఎస్ రేపు కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనున్నది. హైడ్రా కూల్చివేత్తలు, మూసీ నిర్వాసితుల విషయంలో ఇటీవల కేటీఆర్, హరీశ్ రావు తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈసందర్భంగా హైడ్రా బాధితుల తరపున బీఆర్ఎస్ కొట్లాడుతుందని ప్రకటించారు. అయితే హైడ్రా విషయంలో గ్రేటర్ బీఆర్ఎస్ పరిధిలోని మరికొంత మంది కీలక నేతలు సైలంట్ గా ఉన్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ అంశంలో గ్రేటర్ పరిధిలోని నేతల మధ్య ఏకాభిప్రాయం లేదనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇదే సమయంలో గ్రేటర్ పరిధికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరబోతున్నానని ప్రకటించారు. ఈ ఇటువంటి తరుణంలో హైడ్రా పేరుతో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం కాబోతుండటం పొలిటికల్ కారిడార్ లో ఆసక్తిగా మారింది.

Next Story